calender_icon.png 6 February, 2026 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్‌

06-02-2026 01:50:42 PM

ముజఫర్‌నగర్: షామ్లీ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో(Encounter) తలపై రూ. 50,000 బహుమతి ఉన్న వాంటెడ్ క్రిమినల్(Wanted Criminal Shot Dead) మరణించాడని అధికారులు శుక్రవారం తెలిపారు. షమ్లీ పోలీసు సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ మాట్లాడుతూ, రిహాన్ అన్సారీ అని గుర్తించబడిన ఆ నిందితుడు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో నమోదైన సుమారు 90 క్రిమినల్ కేసులలో వాంటెడ్ నిందితుడని తెలిపారు. గురువారం రాత్రి పొద్దుపోయాక, రిహాన్ రోడ్డు దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అడ్డగించారని, ఆ సమయంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఎస్పీ తెలిపారు.

పోలీసు బృందం అతడిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, అతను పారిపోవడానికి ప్రయత్నించి కాల్పులు జరిపాడు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో అతను గాయపడ్డాడు. తరువాత మరణించాడని సింగ్ తెలిపారు. అతని వద్ద నుండి పోలీసులు రెండు పిస్టళ్లు, ఒక మోటార్ సైకిల్, దోచుకున్న ఒక మొబైల్ ఫోన్, రెండు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల సమయంలో, సుమిత్ కుమార్ అనే పోలీసు కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.