కాళేశ్వరం బరాజ్ల సందర్శన
సాంకేతిక పరీక్షల పనులను పరిశీలించిన ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీబరాజ్, అన్నా రం సరస్వతి బరాజ్లను గురువారం ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా మేడిగడ్డలో కొనసాగుతున్న బోర్ హోల్స్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని సూ చించారు. అనంతరం అన్నారంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద అదనపు సిబ్బంది వసతి కొరకు గదులను పరిశీలించారు. అన్నారం ప్రాజెక్ట్ అప్ స్ట్రీమ్ను పరిశీలించి బోర్ హోల్స్ పనులను ప్రారంభించాలని ఆదేశించారు.






