25 February, 2026 | 8:43 AM

బాధితులకు సత్వర న్యాయం చేయాలి: ఎస్పీ

24-02-2026 01:12 AM

కుమ్రం భీం  ఆసిఫాబాద్, ఫిబ్రవరి23 (విజయ క్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ ఫిర్యాదిదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను శ్రద్ధగా విన్న ఆమె వాటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోనుకాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించి తమ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు.ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.