13-04-2025 01:34:04 AM
* సన్రైజర్స్ హైదరాబాద్ సంచలనం
* 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి
* సెంచరీ బాదిన అభిషేక్ శర్మ
ఉప్పల్/లక్నో, ఏప్రిల్ 12: ఐపీఎల్ 18వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఊహకందని విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా పరుగుల వరద పారిన మ్యాచ్లో సన్రైజర్స్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82) విధ్వంసానికి తోడు ప్రభ్సిమ్రన్ (42), స్టోయినిస్ (34*) చెలరేగారు. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనకు దిగిన సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141) విధ్వంసక సెంచరీతో చెలరేగగా..హెడ్ (66) రాణించాడు.
లక్నో ‘హ్యాట్రిక్’ విజయం
మరో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయాన్ని అందుకుంది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (56), గిల్ (60) రాణించారు. శార్దూల్, బిష్ణోయి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్నో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పూరన్ (61), మార్కరమ్ (58) అర్థసెంచరీలతో జట్టును గెలిపించారు. డబుల్ హెడర్లో భాగంగా నేడు తొలి మ్యాచ్లో రాజస్థాన్తో బెంగళూరు, ముంబైతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.