29 April, 2026 | 10:48 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

19-11-2025 08:35 PM

నంగనూరు: మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రాజగోపాల్‌పేట పోలీసులు పట్టుకున్నారు. రాజగోపాలపేట గ్రామానికి చెందిన శివరాత్రి బాబు తన ట్రాక్టర్‌లో నంగునూరు వాగు నుండి ఇసుకను పాలమాకుల గ్రామానికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.బస్వాపూర్ గ్రామానికి చెందిన చామంతుల రాజు బస్వాపూర్ వాగు నుండి ఇసుకను బద్దిపడగ గ్రామానికి  తరలిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితులపై కేసు నమోదు చేసి సిద్దిపేట కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై టి. వివేక్ తెలిపారు.మండలంలో అనుమతులు లేకుండా తీసుకొని తరలిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వివేక్ హెచ్చరించారు.అక్రమ ఇసుక రవాణకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు.