19 May, 2026 | 1:45 AM

అమ్మకానికి రెండు తలల పాములు

19-05-2026 12:36 AM

నిందితుడిని పట్టుకున్న డీఆర్‌ఐ అధికారులు

వరంగల్, మే 18 (విజయక్రాంతి): అరుదైన రెండు తలల పాములను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని వరంగల్ నగరంలోని ఏనుమాములలో డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) ప్రత్యేక బృందం సోమవారం అదుపులోకి తీసుకుంది. అతని వద్ద రెండు పాములను స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీ య సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు సదరు వ్యక్తిని తనిఖీ చేయగా ఆయన చేతి సంచిలో రెండు పాములు సజీవంగా ఉన్నవి లభ్యమయ్యాయి. వరంగల్  అటవీ శాఖ అధికారులకు పాములను అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. రెండు తలల పాములను పట్టి విక్రయిస్తే పెద్ద మొత్తంలో డబ్బు దక్కుతుందని ప్రచారం చాలా కాలంగా ఉంది. ఈ క్రమం లో ఈ సంఘటన వరంగల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.