విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
28-07-2026 12:58 PM
మెదక్ జిల్లా విద్యాధికారి రాజు
పాపన్నపేట: ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. మంగళవారం పాపన్నపేట ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించి తగు సూచనలు చేశారు. మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఉన్నత పాఠశాల హెచ్ఎం మహేశ్వర్ తదితరులు ఉన్నారు.






