10 August, 2026 | 8:57 PM

Breaking News

వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ   •   గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి   •   బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసన   •   సంజయ్‌ని కలిసిన బిజెపి జిల్లా అధ్యక్షులు   •   ఆలేరు నూతన ఎస్‌హెచ్‌ఓ ఉదయ్ కిరణ్‌కు ఘన సన్మానం   •   రామప్ప సరస్సు నీటితో గణపసముద్రం నింపండి   •   మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తల్లికి పద్మాదేవేందర్‌రెడ్డి నివాళి   •   ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ నాయకుడు ఆఫ్రిద్‌ను పరామర్శించిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి   •   నిండు కుండగా మారిన ఎల్లయ్య చెరువు   •   తుంగతుర్తి పీఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులుగా పోతురాజు, బాణాల   •  

సీపీకి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన టీఎన్జీవో నేతలు

30-09-2025 05:56 PM

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిసి సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీని శాలువా, పుష్పగుచ్ఛం, మెమెంటో, స్వీట్లు అందజేసి సన్మానించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను వివరించి, ప్రతి సంవత్సరం టీఎన్జీవోల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఉద్యోగులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజేష్ భరద్వాజ్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఏ.వి. రాజేశ్వరరావు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కోటా రామస్వామి, శంకర్, కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.