17 June, 2026 | 12:07 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల్లో పటిష్ట బందోబస్తు

19-01-2026 12:00 AM

అదనపు ఎస్పి మహేందర్ 

మెదక్, జనవరి 18 :మాఘ అమావాస్య సందర్భంగా ఆదివారం ఏడుపాయలలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు ఏర్పాట్లను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదు పాయాలు, భద్రతా చర్యలు, మహిళా భక్తుల రక్షణ తదితర అంశాలపై అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జాతరను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని సూచించారు.