calender_icon.png 21 February, 2026 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి

21-02-2026 02:27:35 AM

నిర్మల్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): వెంగ్వపేట గ్రామ చెరువును అభివృద్ధి చేసి తద్వారా సాగునీటి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనీ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కుచాడి శ్రీహరి రావు విన్నవించారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి మామడ మండలంలోని వాస్తపూర్ జలపాతాన్ని కూడా పర్యటక ప్రాంతంగా గుర్తించాలని విన్నవించారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి మామడ తాజా మాజీ  జడ్పీటీసీ సంతోష్, వెంగ్వపేట మాజీ సర్పంచ్ రమేష్ కుమార్ జిల్లా కాంగ్రెస్  నాయకులు కొట్టే శేఖర్, నాయనగారి మురళి, అజయ్, రామారావు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.