calender_icon.png 6 February, 2026 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్లు కోల్పోతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది

06-02-2026 01:38:28 AM

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): భద్రకాళి మాఢవీధుల నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో భద్రకాళి మాడవీధుల నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలతో డబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కుడా, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇండ్లు కోల్పోతున్న వారు తమ అభిప్రాయాలను కలెక్టర్ కు తెలియజేశారు. ఇండ్లు కోల్పోతున్న తమకు మరొకచోట ఇండ్లు ఇవ్వాలని, కల్పించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.  ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి సిద్ధార్థ నాయక్, మైనింగ్ ఏడి రవిశంకర్, జి డబ్ల్యూఎంసి కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.