15 July, 2026 | 2:11 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

అత్యధిక కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి

20-12-2025 01:18 AM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 19, (విజయక్రాంతి):డిసెంబర్ 21వ తారీకున  జర గనున్న జాతీయ లోక్‌అదాలత్ ను విజయవంతం చేయాలని ఎస్ యు కె జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీటింగ్  హాలులో కోర్ట్ కానిస్టేబుల్స్ లతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి ఎం. రాజేందర్  అన్నారు. రాజీకాదగిన పెండింగ్ క్రిమినల్ కేసులు , ఇ -పిటి కేసుల వివరాలను ఠాణాల వారిగ అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరు సమన్వయంతో పని చేయాలని తె లిపారు. ఈ సారి జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసులను పరిష్కరించడం ద్వారా జిల్లాను  ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం పోలీస్ అధికారులు కృషి చే యాలని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రాజమల్లు, కోర్టు కానిస్టేబుల్స్, రామిశెట్టి రమేష్ పాల్గొన్నారు.