15 June, 2026 | 2:54 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మహిళల ప్రత్యేక పూజలు

12-06-2026 04:04 PM

అమ్మవారికి ఓడి బియ్యం....

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): అధిక జేష్ట మాసం సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు, ధర్మో రక్షతి, రక్షితః ట్రస్ట్ అనుబంధ సంస్థ శ్రీ శైవ క్షేత్ర వనిత శక్తి, కరీంనగర్ మహిళల ఆధ్వర్యంలో మన అమ్మకు మనసారే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వినీత, సంధ్య లు తెలిపారు.

36 మంది మహిళలు 33 రకాల వైనాలు తీసుకువచ్చారు, శ్రీ వేణుగోపాల స్వామి వద్ద ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు, ఆలయ అర్చకులు సౌమితి శ్రావణ్ కుమార్ మహిళలచే ప్రత్యేక  పూజలు చేయించారు. అలాగే సాంబశివ దేవాలయంలోనూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.  సామాజిక సేవకులు పల్లకిషన్ మహిళలకు చల్లటి కూల్ డ్రింక్స్  అందజేశారు,  ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ పలువురు పాల్గొన్నారు,