మల ద్వారంలో పెట్టిన పైపు.. మృతి చెందిన యువకుడు!
07-04-2026 02:13 PM
షాద్నగర్, (విజయక్రాంతి): ఇద్దరు స్నేహితులు నవ్వుతూ చేసిన తమాషాతో ఒకరు ప్రాణం కోల్పోయారు. రంగరెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ సీఐ సీతారాం తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని విజయ నేహా పరిశ్రమలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్, సాయి అనే ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు స్నేహితులు నవ్వుతూ తమాషాలాడారు. ఈ క్రమంలోనే సాయి పరిశ్రమలో వాడే గాలి పైపును పవన్ మల ద్వారం లొ పెట్టాడు. దీంతో పవన్ (20) మరణించాడు. మృతుడు పవన్ సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ సీతారాం తెలిపారు....




