17 March, 2026 | 4:39 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

గ్యాస్ సిలిండర్ల కొరత.. ఉదయం నుంచే పడిగాపులు

17-03-2026 01:37 PM

మొయినాబాద్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్(Moinabad) ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. సిలిండర్ కోసం స్థానికులు ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల(Gas Agencies) వద్ద బారులు తీరుతూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం, ముందుగా బుక్ చేసిన సిలిండర్లు కూడా సమయానికి అందకపోవడంతో ప్రజలు నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లి నిలబడాల్సి వస్తోంది. కొందరు వినియోగదారులు రెండు నుంచి మూడు రోజులుగా తిరుగుతున్నా సిలిండర్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కూడా గ్యాస్ సరఫరాలో ఆలస్యాలు(Delays in Gas Supply) చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత కూడా 10 రోజులు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఈ పరిస్థితికి అంతర్జాతీయ స్థాయిలో ఎల్‌పీజీ(LPG Shortage) సరఫరా లోపాలు, డిమాండ్ పెరగడం ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. స్థానికులు తక్షణ చర్యలు తీసుకుని సరఫరా పెంచాలని అధికారులను కోరుతున్నారు. గ్యాస్ కొరతను నియంత్రించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.