17 April, 2026 | 11:48 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

బ్యాంక్ పథకాలు ప్రజలకు మేలు

04-10-2025 07:17 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రజలకు మేలు చేసే అనేక పథకాలను ఎస్బిఐ బ్యాంకు అందజేస్తుందని పూసుగూడెం ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ బి.నాగేంద్ర బాబు తెలిపారు. శనివారం  శాఖలో కస్టమర్ కుంజా ముత్యాలు మరణానంతరం నామినీగా ఉన్న ఆయన భార్య కుంజా వెంకటమ్మకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద మంజూరైన రూ.2,00,000/- బీమా క్లెయింను అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర బాబు మాట్లాడుతూ... ప్రభుత్వం అమలు చేస్తున్న PMJJBY, PMSBY (ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన), APY (అటల్ పెన్షన్ యోజన)తో పాటు మా ఎస్బిఐ శాఖ అందిస్తున్న రుణ సౌకర్యాలు, చిన్న పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండడమే గాక ఎంతగానో మేలు చేస్తాయన్నారు. ప్రతి కుటుంబం ఈ పథకాలలో చేరి తమ భవిష్యత్తును భద్రపరచుకోవాలని సూచించారు.