1 July, 2026 | 6:42 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

సెమీస్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ ఓటమి

21-12-2025 12:00 AM

హాంగ్‌జౌ, డిసెంబర్ 20 : ఏడాది చివరి బ్యాడ్మింటన్ టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూ ర్ ఫైనల్స్‌లో భారత పురుషుల జోడీ సాత్విక్ సాయిరాజ్ , చిరాగ్ షెట్టి పోరాటం ముగిసింది. భారత జోడీ సెమీఫైనల్లో పరాజ యం పాలైంది. వరుస విజయాలతో టైటిల్‌పై ఆశలు రేకెత్తించిన సాత్విక్-చిరాగ్ జోడీ హోరాహోరీ పోరులో 21-10, 17-21, 13-21 స్కోర్ తేడాతో చైనాకు చెందిన లియాంగ్ వి కెంగ్, వాంగ్ చెంగ్ జంట చేతిలో పోరాడి ఓడింది.

తొలి గేమ్ గెలుచుకున్న తర్వాత ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం లో భారత జంట విఫలమైంది. గంటా 3 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చైనా పెయిన్ అద్భుతంగా పుంజుకుంది. రెండో గేమ్‌లో ఆధిక్యం సాధించే అవకాశం వచ్చినప్పటకీ చైనా ప్లేయర్స్ దూకుడుగా ఆడి ఆ అవకాశం లేకుండా చేశారు.