కొత్తగూడెం డీఆర్ఓగా ఎస్.పద్మావతి
19-05-2026 12:21 AM
జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పద్మావతి
భద్రాద్రి కొత్తగూడెం, మే 18, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన జిల్లా రెవెన్యూ అధికారిగా (డిఆర్ఓ) ఎస్. పద్మావతి నియమితులయ్యారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ అంకిత్ను కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై స్వల్పంగా చర్చించారు.






