రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీక్(NEET paper leak) ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) పార్లమెంట్ కు హాజరు కావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు సభకు అంతరాయం కలిగించడం కొనసాగించడంతో, రాజ్యసభ(Rajya Sabha adjourned) కార్యకలాపాలను సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. గత నెలలో రాజధానితో పాటు ఇతర రాష్ట్రాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సహా ప్రతిపక్ష సభ్యులు హోం మంత్రి నుండి సమాధానం కోరుతూ నినాదాలు చేశారు. అయోధ్యలోని రామమందిరానికి సంబంధించిన విరాళాల చోరీ ఆరోపణలపై ఎంపీలు నినాదాలు చేశారు.






