13 May, 2026 | 3:32 PM

రైతులకు నాణ్యతమైన విత్తనాలు సరఫరా చేయాలి

13-05-2026 02:44 PM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

ఉట్నూర్, మే 13,(విజయక్రాంతి): రైతులు సాగు చేసే  పంటలకు నాణ్యతమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు  పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని  దంతాన్ పల్లి  హాక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విత్తనాలు, ఎరువులు దుకాణాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల నుండి  విత్తనాలు కొనుగోలుకు  రైతులు వస్తారని, వారికి నాణ్యతమైన  విత్తనాలు సరఫరా చేయాలని  సూచనలు చేశారు. ఆయనతోపాటు  జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు  లింగంపల్లి చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.