22 August, 2026 | 3:47 PM

Breaking News

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి   •   మైనారిటీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్   •   జవాబుదారితనంతో విధులు నిర్వహించాలి   •   సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్ రూపా రెడ్డికి శ్రద్ధాంజలి   •   కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యమాలకు సిద్ధం కావాలి   •   చెట్టు కిందే తరగతులు.. కళాశాలలో వసతిగృహం నిర్వహణ   •   పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి   •   ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష

22-08-2026 02:40 PM

ముకరంపుర, ఆగస్టు 22(విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం బొమ్మకల్ లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలని, డిప్లమో విద్యార్థులకు న్యాయం చేయాలని నిరసిస్తూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ జాతీయ విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు చేశారని సాంకేతిక విద్యను ప్రైవేట్ పరం చేసె అవకాశం ఉందని కాబట్టి తక్షణమే ప్రభుత్వం తమకు విలీనం చేసే ఉద్దేశం లేదని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, సన్నిత్ నాయకులు రిషి ,సాయి తదితరులు పాల్గొన్నారు.