25 July, 2026 | 4:11 PM

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రియాంక గాంధీ

25-07-2026 03:21 PM

వయనాడ్: వయనాడ్ కొండచరియలు(Wayanad landslide site) విరిగిపడిన ప్రాంతాన్ని  ప్రియాంక గాంధీ సందర్శించారు. ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న కొండచరియల విపత్తు తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా కల్లాడిలో ఉన్న ఆ ప్రాంతాన్ని మొదటిసారిగా సందర్శించి, ప్రమాదం నుండి బయటపడిన కొందరితో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ ఉదయం కన్నూర్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి వయనాడ్ నియోజకవర్గంలోని మెప్పాడిలో ఉన్న కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. విపత్తు ప్రదేశానికి వెళ్లే మార్గంలో, వాద్రాను వయనాడ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు అభినందించారు. నీట్ పరీక్షలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసనకు నాయకత్వం వహించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... కనిపిస్తున్న శిథిలాలు, బురద నదిలోకి కొట్టుకుపోకుండా ఉండేలా తాత్కాలిక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విచారణ పూర్తయిన తర్వాత శాశ్వత చర్యలు చేపట్టవచ్చన్నారు. కేంద్రం ఎప్పుడూ రాజకీయ పక్షపాత ధోరణినే ప్రదర్శిస్తోందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ, ఇతర చోట్లా ఇదే పరిస్థితి ఉందని ఆరోపించారు. కాబట్టి కేంద్రంపై పెద్దగా ఆధారపడలేమన్న ఆమె తమ శక్తిమేర తాము అన్ని చర్యలూ చేపట్టామని, ఇకపైనా అలాగే కొనసాగిస్తామని పేర్కొన్నారు.