1 July, 2026 | 6:39 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

రఫేల్‌లో రాష్ట్రపతి గగన విహారం

30-10-2025 01:25 AM

-అంబాల్ ఎయిర్‌బేస్ నుంచి ముర్ము ప్రయాణం

-పైలట్‌గా ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ టీం శివాంగీసింగ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపదీ ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో సుమారు అరగంట పాటు గగనవిహారం చేశారు. హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్ ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ టీం లీడర్ శివాంగీ సింగ్ పైలట్‌గా ఆమె ఈ పర్యటనను విజయవంతం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఫైటర్ జెట్‌లో ప్రయాణించడం ఇది రెండోసారి. చివరిసారి 2023 ఏప్రిల్‌లో ఆమె సుఖోయ్ -30 ఫైైటర్ జెట్‌లో ప్రయాణించారు.

తాజాగా రాఫేల్ జెట్‌లో ప్రయాణించి రికార్డు సృష్టించారు. ఈ విహారానికి సంబంధించిన సంబంధించిన ఫొటోలను భారత వాయుసేన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో శివాంగీ సింగ్‌ను బంధించినట్లు నాడు పాకిస్తాన్ అబద్ధపు ప్రచారం చేసింది. అయితే.. అదంతా ఫేక్ ప్రచారమని భారత ప్రభుత్వం అప్పట్లోనే ఖండించింది. రాష్ట్ట్రపతి ముర్ము తాజాగా ఫొటో దిగడంతో మరోసారి శివాంగీ వార్తల్లో నిలిచారు.

శివాంగీ సింగ్ వారణాసి.  ఆమె పాఠశాల విద్యాభ్యాసం స్వస్థలంలోనే సాగింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆమె డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఎన్‌సీసీలో చేరారు. 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికయ్యారు. ‘మిగ్ బైసన్’ యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు. ఆ అనుభవంతోనే 2020లో ఆమె అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి అంబాలా ఎయిర్‌బేస్‌లోని ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ బృందంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు.