18-02-2026 12:00:00 AM
డ్రగ్ పాజిటివ్ కేసు నమోదు
మొయినాబాద్, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి): మొయినాబాద్ పోలీసుల రాత్రి పర్యవేక్షణలో భాగంగా తెల్లవారుజామున సుమారు 2.00 గంటల సమయంలో చిన్నమంగలరామ్ గ్రామ పరిధిలోని సుకస ఫాం హౌస్పై దాడి నిర్వహించారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా మద్యం సేవిస్తూ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించగా, పార్టీలో పాల్గొన్న వారి లో ఒకరికి డ్రగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
దీనిపై పోలీసు లు వెంటనే చర్యలు తీసుకుని పార్టీ నిర్వాహకుడు, ఫాం హౌస్ యజమానిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం, మద్యం సేవించడం, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొ న్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తూ దర్యా ప్తు చేపట్టినట్లు వెల్లడించారు. పోలీసులు హెచ్చరిస్తూ, ఫార్మ్ హౌస్లో అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.