28 June, 2026 | 2:59 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

లోక్‌సభలో హిందీలో మాట్లాడిన నిర్మల

05-12-2025 01:12 AM
  1. ఎంపీ సౌగత్‌రాయ్ అభ్యంతరం 

నేను ఏ భాషలోనైనా మాట్లాడొచ్చన్న కేంద్రమంత్రి 

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: పార్లమెంట్ సమావేశాల్లో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక బిల్లుపై హిందీలో మాట్లాడారు. ‘నిర్మలా జీ కూడా హిందీలో మాట్లాడారు. మేం బెంగాలీలం. ఆమె చెప్పినదాన్ని నేను అనుసరించలేకపోయాను.

మేం హిందీని అంతగా అనుసరించం’ అని ఎంపీ సౌగత రాయ్ అన్నారు. సభా కార్యకలాపాలు బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయని చైర్ జగదాంబికా పాల్ వెంటనే తెలిపారు.  చర్చలో జోక్యం చేసుకుంటూ సీతారామన్.. రాయ్ వ్యాఖ్యను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘నేను హిందీ, తమిళం, తెలుగు ఇంగ్లిషులో మాట్లాడొచ్చు.  ‘నేను హిందీలో మాట్లాడాను. కాబట్టి అతను అర్థం చేసుకోలేడు? బిల్లు నుంచి దృష్టి మరల్చడానికి రాయ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు.