5 May, 2026 | 1:47 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

లోక్‌సభలో హిందీలో మాట్లాడిన నిర్మల

05-12-2025 01:12 AM
  1. ఎంపీ సౌగత్‌రాయ్ అభ్యంతరం 

నేను ఏ భాషలోనైనా మాట్లాడొచ్చన్న కేంద్రమంత్రి 

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: పార్లమెంట్ సమావేశాల్లో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక బిల్లుపై హిందీలో మాట్లాడారు. ‘నిర్మలా జీ కూడా హిందీలో మాట్లాడారు. మేం బెంగాలీలం. ఆమె చెప్పినదాన్ని నేను అనుసరించలేకపోయాను.

మేం హిందీని అంతగా అనుసరించం’ అని ఎంపీ సౌగత రాయ్ అన్నారు. సభా కార్యకలాపాలు బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయని చైర్ జగదాంబికా పాల్ వెంటనే తెలిపారు.  చర్చలో జోక్యం చేసుకుంటూ సీతారామన్.. రాయ్ వ్యాఖ్యను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘నేను హిందీ, తమిళం, తెలుగు ఇంగ్లిషులో మాట్లాడొచ్చు.  ‘నేను హిందీలో మాట్లాడాను. కాబట్టి అతను అర్థం చేసుకోలేడు? బిల్లు నుంచి దృష్టి మరల్చడానికి రాయ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు.