10-02-2026 05:53:31 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరి బస్సు హైదరాబాద్ నుండి నిర్మల్ వస్తుంది. నర్సాపూర్ (జి) చెందిన సత్తయ్య విలువైన సెల్ ఫోన్ పోగొట్టుకుని బస్ దిగిపోయాడు. బస్సు డిపోకు చేరుకోగానే బస్ చెక్ చేయగా అందులో సెల్ ఫోన్ లభ్యమయింది. సెల్ ఫోన్ ఆధారంగా సదరు ప్రయాణికున్ని పిలిపించి సెక్యూరిటీ విజలెన్స్ అధికారి విగ్నేష్ రెడ్డి, ఆన్ డ్యూటీ కంట్రోలర్ జి.ఆర్.రెడ్డి సమక్షంలో ఫోన్ అప్పచెప్పడం జరిగింది. నిజాయితీగా సెల్ ఫోన్ అప్పగించిన డ్రైవర్ నందిపేట సుమన్ ను డిపోమేనేజర్ కే పండరి అభినందించారు.