2 April, 2026 | 3:28 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

బీసీ రక్షణ చట్టం కోసం జాతీయ స్థాయిలో ఒత్తిడి

02-04-2026 01:22 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

ముషీరాబాద్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): బీసీ వర్గాల హక్కుల సాధన కోసం నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా బీసీ ప్రతినిధుల బృందం కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అతవాలేను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా బీసీ వర్గాలకు సంబంధించిన కీలక సమస్యలు, దీర్ఘ కాలిక డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించటం జరిగిందని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్కుమార్, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంలు బుధవారం వెల్లడిం చారు.

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించడం, ఉద్యోగాలు, విద్యా రంగంలో రిజర్వే షన్లు మాత్రమే కాకుండా ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని మం త్రికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు వారు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ ప్రతినిధులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ డిమాండ్లపై కేంద్ర మంత్రి రాందాస్ అతవాలే సానుకూలంగా స్పం దిస్తూ బీసీ వర్గాల సమస్యలను కేంద్ర స్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.