21-02-2026 12:00:00 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మ దినం పురస్కరించుకుని వారి మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి తల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలు అందరికీ ఉండా లని ఆకాంక్షించారు. శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని,
నివాసానికి వచ్చిన కూకట్పల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం ఓల్ బోయిన్పల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ తో కలిసి పూల బొకే ఇచ్చి, శాలువా తో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షులు ఇర్ఫాన్ భాయ్, సెక్రెటరీ హరినాథ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.