27 March, 2026 | 5:26 PM

శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

27-03-2026 03:28 PM

సీతారామ చంద్రుల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

కామారెడ్డి,(విజయక్రాంతి): శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే మదన్మోహన్రావు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

దేవాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు సహకారంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రంగు రవీందర్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రంగు రవీందర్ గౌడ్, ఆలయ ఈవో బూర్ల ప్రభు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీతారామచంద్రుని కళ్యాణం ఉత్సవాలలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.