వైద్య ఖర్చులకు ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె
19-04-2026 03:12 PM
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన దొడ్డాకుల గిరిబాబు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతుండగా సర్జరీ కొరకు అవసరమైన లక్ష రూపాయలను ప్రభుత్వం నుంచి ఎల్ఓసి ద్వారా మంజూరు చేసి ఆసుపత్రిలో గిరిబాబుని పరామర్శించి స్వయంగా చెక్కును అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ అందచేశారు.






