మహంకాళి బోనాలకు రూ.1.50 లక్షల విరాళం ఇచ్చిన మైనారిటీ నాయకులు రఫీ
15-07-2026 06:06 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం,చేగుంట పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు పట్టణ ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ తన ఉదారతను చాటుకున్నారు. అమ్మవారి ఉత్సవాల నిమిత్తం తన వంతు సహాయంగా రూ.1,50,000 (ఒక్క లక్షా యాభై వేల రూపాయలు) విరాళాన్ని ప్రకటించి, ఆ నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. ఆ మహంకాళి తల్లి దీవెనలతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవత కరుణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






