సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం
30-05-2026 09:08 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామ లో భూ సమస్యలపై శనివారం నాడు సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు సత్యనారాయణ పురం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులతో ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో రైతులకు భూ సమస్యలు అతి త్వరలోనే పరిష్కారం జరుగుతుందని మాట్లాడినారు.






