12 May, 2026 | 11:15 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

శ్రీరామ్ నగర్‌కు వైద్య భరోసా

03-11-2025 02:46 AM

మణికొండ, నవంబర్2 : మణికొండ ఏఎం క్యూర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పుప్పాలగూడలోని శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్‌లో ఉచిత ఆరోగ్య తనిఖీ శిబిరం నిర్వహించారు. సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య ఈ శిబిరానికి నేతృత్వం వహించారు.ఈ శిబిరంలో మధుమేహం, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు, రెటీనా చెకప్, జనరల్ డాక్టర్ కన్సల్టేషన్ సేవలను ఉచితంగా అందించారు. ఈ శిబిరానికి స్థానికుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమానికి మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మణికొండ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ ప్రెసిడెంట్ అర్వపల్లి వంశీ, కస్తూరి రాములు హాజరయ్యారు. వారితో పాటు శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ, కాంతారావు, డాక్టర్ ప్రభావతి, డబ్ల్యూఆర్4 గ్రూప్ ప్రెసిడెంట్ సీతారాం దాస్ పాల్గొన్నారు.

నివాసితులకు విలువైన వైద్య సేవలు అందించినందుకు డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య, శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బృందాన్ని వారు అభినందించారు. శిబిరానికి మద్దతు తెలిపిన వాలంటీర్లకు, పాల్గొన్నవారికి ఏఎం క్యూర్ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. మణికొండలో ఇలాంటి కమ్యూనిటీ ఆరోగ్య కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.