1 July, 2026 | 11:12 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రాణహిత పూర్తి వివరాలందించాలి

08-10-2025 12:00 AM

ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్

కుమ్రం భీం అసిఫాబాద్, అక్టోబర్ 7(విజయక్రాంతి):ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ స్థలా న్ని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రశాం త్ జీవన్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. ప్రాణహిత నదిలో నీటి లభ్యత, నీటి ప్రవాహం, ప్రాజెక్టు నిర్మాణ స్థలం. ఇక్కడి భూమి స్థితి గతులను ఆయన పరిశీలించారు. అధికారులు ప్రాజెక్టు నిర్మాణ స్థలం, ఇతర వివరాలను మ్యాప్లో ఆయనకు చూపించి వివరించారు.. ప్రాణహిత ఎగువన వైన్ గంగా, వార్దా నదుల కలయిక, నిర్మాణ స్థలాన్ని చైనాక్యులర్తో పరిశీలించారు.

ప్రాణహిత నది తీరంలో కాసేపు తిరిగి ప్రాజెక్టు నిర్మాణానికి సంబందించి సమగ్ర వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇరిగేషన్ సిఇ సత్యనారాయణ చంద్ర, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, డిఈ వెంకటరమణ, భద్రయ్య, తిరుపతి, భానుమూర్తి, తహసీల్ సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, తాసిల్దార్ లు దిలీప్, దేవేందర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.