జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం
08-06-2026 05:54 PM
- జూనియర్ సివిల్ జడ్జి వి.మాధవి
మెట్ పల్లి,(విజయక్రాంతి): ఈ నెల ఇరవై తేదిన జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అని మెట్ పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి పిలుపునిచ్చారు. మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రో లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... కక్షిదారులు పరస్పరం రాజీ పడటంలో న్యాయవాదులు, పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. మీడియాషన్ కో ఆర్డినేటర్లు కూడా కాక్షిదారులని కౌన్సిలింగ్ ద్వారా రాజీ పడేట్టు కృషి చేయాలని పేర్కొన్నారు. శ్రీరామ్ చిట్స్ మరియు కెనరా బ్యాంకు మేనేజర్లు కూడా వారి ఖాతాదారులపై కేసులు విరమించు కోవడానికి చర్చల ద్వారా ప్రయత్నించాలని కోరారు.






