23 April, 2026 | 5:07 PM

Breaking News

అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్   •   ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్   •   వన్యప్రాణుల క్రమ శిక్షణ   •   ఏటీఎంలో వ్యక్తి మృతదేహం.. మసబ్ ట్యాంక్‌లో కలకలం   •   3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు   •   కాళేశ్వరంపై కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయి   •   అకాల వర్షంతో తడిసిన వడ్లు – ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి   •   ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. హైదరాబాద్‌కు వర్ష సూచన   •   ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి   •   పోలీసుల ఆంక్షల మధ్య రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె   •  

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

19-11-2025 05:09 PM

కాటారం (విజయక్రాంతి): భారతదేశ మొదటి మహిళ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాటారం మండలం ధన్వాడ గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన మహనీయురాలని, దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల యూత్ అధ్యక్షులు మహేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొడిగె గిరీష్, చీకట్ల వెంకటేష్, తోట కిషోర్, బుర్రి సుధాకర్, పుట్ట రాజేందర్, రఘునందన్, కోడి రవికుమార్, కొండ్ర శివ, శ్రీకాంత్, చిటూరి రాజేష్, గణేష్, కొండ్ర శ్రీకాంత్, చింటూ, తదితరులు పాల్గొన్నారు.