25 May, 2026 | 6:58 PM

Breaking News

ఆ పన్నులను ఆదుకుంటేనే... జీవితంలో సార్ధకత   •   నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. నలుగురు నిందితులు అరెస్టు   •   ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: పిల్లుట్ల రఘు   •   ఏడుపాయల చెక్‌డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం   •   ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   పాలకోయ్యతండా, మంచి కనగర్ చిన్నారులను విద్యకు దూరం చేయవద్దు   •   రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థి ప్రతిభ   •   ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. సిఐటియు డిమాండ్   •   ఈత సరదా విషాదంగా మారొద్దు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   వడ దెబ్బతో వ్యక్తి మృతి   •  

ప్రజావాణి ఫిర్యాదులకు తక్షణ చర్యలు

17-03-2026 12:29 AM

జిల్లా అదనపు కలెక్టర్ పాండు 

సంగారెడ్డి, మార్చి 16: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ పాండు అ న్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అ దనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. భూమి సమస్యలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు  మాట్లాడుతూ ప్రజల నుండి ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఆర్జీలను ఆలస్యం చేయకుండా త్వరి తగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 57  అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. అందిన ప్రతి వినతిని నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వాటికి తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు , ప్రజలు,  సిబ్బంది పాల్గొన్నారు.