22 May, 2026 | 7:36 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

హైడ్రా కమిషనర్ గన్ మెన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

21-12-2025 12:39 PM

ఎల్బీనగర్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత గన్ మెన్ ఆదివారం తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఎల్బీనగర్ లోని కామినేని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. గన్ మెన్ ఆత్మహత్యతో తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణచైతన్య హయత్ నగర్ నివాసం ఉంటున్నాడు. తన నివాసంలో ఆదివారం గన్ తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణచైతన్య ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.