20-02-2026 09:42:37 PM
బులియన్ మర్చంట్స్ అసోసియేషన్
కోదాడ: కోదాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం నూతన మునిసపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి పట్టణాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు. బులియన్ మర్చంట్స్ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, ముత్తినేని సైదులు, నలమాద సాయి, బుడిగం నరేష్, బుడిగం రాజేష్, బరపటి వెంకన్న, కాశి, ఉప్పతల శ్రీను, ఆరె నవీన్, ఓరుగంటి నవీన్, బి శంకర్, రమేశ్, నాగార్జున రెడ్డి, గణేష్, వేణు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.