28 April, 2026 | 7:16 PM

ప్రజల దాహం తీర్చిన సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి

28-04-2026 05:44 PM

నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న మహాదేవ్ తండాకు బోరు ఏర్పాటు

గ్రామస్తుల నుంచి ఘన సన్మానం

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తండా పరిధిలో గల మహాదేవ్ తండాలో తీవ్రమైన నీటి కొరత నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం రోజూ కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను మాజీ జడ్పిటిసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి సీనియర్ హైకోర్టు న్యాయవాది మొహ్మద్ మొయిన్ అహ్మద్ ఖాద్రి దృష్టికి తీసుకెళ్లారు.

సమస్య తీవ్రతను గుర్తించిన ఖాద్రి వెంటనే స్పందించి, తన అల్లుడి ద్వారా మంగళవారం మహాదేవ్ తండాకు బోరు వాహనాన్ని పంపించారు.బోరు తవ్వకాలు చేపట్టడంతో తండావాసుల నీటి సమస్యకు తాత్కాలిక ఉపశమనం లభించిందనీ, ఆయన చేసిన సేవను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్య నాయక్, వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, తండా ప్రజలు పాల్గొన్నారు.