1 May, 2026 | 10:52 PM

Breaking News

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు   •   హనుమాన్ మాలాదారుల గిరిప్రదక్షిణ   •   సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే   •   మాజీ మంత్రి పువ్వాడను కలిసిన సోయం వీరభద్రం   •   ప్రిన్సిపల్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన దీప కాసరగడ్డ   •   కలం కార్మికులే సమాజానికి దిక్సూచి   •   రైతన్న ఆందోళన చెందకు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా నష్టపరిహారం ఇప్పిస్తా ఎమ్మెల్యే   •   ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి   •   మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణకై పోరాటాలు ఉదృతం చేయాలి   •   ఆర్టిసీ కార్మికులకు అండగా నిలిచిన ప్రభుత్వం   •  

పేద విద్యార్థులకు చేయూతనందిస్తా

02-12-2025 10:05 PM

రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.. 

వెల్దండ: చదువుల్లో రాణించేందుకు పేదరికం అడ్డు రావద్దని అలాంటివారిని ప్రోత్సహించేందుకు అన్నవిధాల సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం వెల్దండ మండలం కేంద్రానికి చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండటంతో అతనికి ల్యాప్‌టాప్ బహుకరించి మాట్లాడారు. చదువుల్లో రాణించేందుకు ఎవరికైనా తనవంతు సహాయ సహకారాలు అందించి ప్రోత్సహిస్తానని అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యనభ్యసించిమంచి గుర్తింపు పొందాలని సూచించారు.