15 July, 2026 | 10:12 AM

సీఎం రేవంత్ రెడ్డికి గువ్వల బాలరాజు లేఖ

15-07-2026 10:10 AM

 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై గువ్వల సంచలన ఆరోపణలు 

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) లేఖ రాశారు. అధికారిగా ఉన్నప్పుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar) అవినీతికి పాల్పడ్డారంటూ లేఖలో పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని లేఖలో ఆరోపించారు. 2013-2021 మధ్య రూ.  10 కోట్లు దుర్వినియోగమయ్యాయని లేఖలో వెల్లడించారు. టెండర్లు లేకుండా ఏకపక్షంగా నిధులు ఖర్చు చేశారని గువ్వల పేర్కొన్నారు. నియామకాలు, క్రమబద్ధీకరణ లో డబ్బు దండుకున్నారని గువ్వల ఆరోపించారు.