12 May, 2026 | 12:09 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ

12-05-2026 10:45 AM

బెజ్జూర్, మే 12 (విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీజీ గురుకుల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణాలకు సోమవారం బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతిలు భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం టీజీ డబ్ల్యూ ఐ డి సి కింద కస్తూరిబా అదనపు గదుల నిర్మాణాలకు రూ 18 లక్షల15 వేలు మంజూరు చేసింది. ఇట్టి పనులను భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీ ఓ శ్రీనివాస్, ఎంఈఓ సునీత, కస్తూర్బా ప్రత్యేక అధికారి అరుణ, ఇంజనీర్ గిరీష్ కుమార్, గ్రామ కార్యదర్శి మీసారి వైకుంఠం,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.