12 May, 2026 | 12:07 PM

Breaking News

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •  

వడదెబ్బతో ఉపాధి కూలి మృతి

12-05-2026 10:44 AM

ఎర్రుపాలెం మే 12( విజయ క్రాంతి): మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన సాని కృష్ణ (43) వడదెబ్బకు గురై మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పనులకు ప్రతిరోజూ హాజరవుతుండేవాడు. ఇటీవల ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో సోమవారం ఉపాధి పనులకు వెళ్లిన కృష్ణ, పని ముగించుకుని ఇంటికి వచ్చిన అనంతరం అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు వారు పేర్కొన్నారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.