26 May, 2026 | 4:25 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

హోర్ముజ్‌ను దాటిన ‘గ్రీన్ శాన్వీ’

05-04-2026 12:00 AM
  1. గల్ఫ్ నుంచి 46,650 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తున్న ట్యాంకర్
  2. జలసంధి నుంచి భారత్‌కు వచ్చిన నౌకలు ఎనిమిది

న్యూఢిల్లీ/ముంబై, ఏప్రిల్ 4: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. దీనివల్ల ప్రపంచ ఇంధన సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ఇంధన మార్కెట్లలో గందర గోళం నెలకొంది. సముద్రయాన గణాంకాల ప్రకారం, ఈ కీలక నౌకా మార్గాన్ని దాటుతున్న సరుకు రవాణా నౌకల్లో 60 శాతం ఇరాన్ నుంచి వచ్చినవే లేదా అటువైపే వెళ్తున్నవే కావడం గమనార్హం.

హోర్ముజ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఈ మార్గం గుండా అత్యధిక సంఖ్యలో నౌకలు ప్రయాణించే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. తాజాగా గల్ఫ్ నుంచి ఎల్పీజీతో వస్తున్న గ్రీన్ శాన్వీ ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్‌ను దాటింది. దీంతో ఇప్పటి వరకు కనీసం ఎనిమిది భారతీయ నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి.

సుమారు 46,650 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సరుకుతో గ్రీన్ శాన్వీ శుక్రవారం రాత్రి హోర్ముజ్ జలసంధిని దాటింది. హోర్ము జ్ సురక్షితంగా దాటిన నౌకలలో శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కి, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ శాన్వీ ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ శాన్వీ భారత్‌కు రానుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గుజరాత్ మంత్రి హర్ష్ సంఘ్వీ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు.