రుద్రంగిలో కురిసిన అకాల వర్షం/తడిసిన ధాన్యం
09-05-2026 08:45 PM
రుద్రంగి,(విజయక్రాంతి): రుద్రంగి మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వియడంతో పలు చోట్ల మామిడి కాయలు నెలా రాలాయి, అలాగే కొనుగోలు కేంద్రాల్లో దాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు గాలికి కొట్టుకు పోవడంతో పలువురి రైతుల ధాన్యం తడిసింది. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనాలని రైతులు కోరారు.






