9 May, 2026 | 9:15 PM

Breaking News

మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •   లాడ్జి యజమానులకు పోలీసుల అవగాహన సదస్సు: ఎస్పీ రోహిత్ రాజ   •  

రుద్రంగిలో కురిసిన అకాల వర్షం/తడిసిన ధాన్యం

09-05-2026 08:45 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రుద్రంగి మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వియడంతో పలు చోట్ల మామిడి కాయలు నెలా రాలాయి, అలాగే కొనుగోలు కేంద్రాల్లో దాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు గాలికి కొట్టుకు పోవడంతో పలువురి రైతుల ధాన్యం తడిసింది. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనాలని రైతులు కోరారు.