రూ.20 లక్షల సుడా నిధులతో యుజిడి పనులకు శంకుస్థాపన
20-06-2026 07:49 PM
కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని 53వ డివిజన్ శర్మనగర్ లో సుడా నిధులు 20 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ లు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కలిసికట్టుగా ముందుకు సాగుతామని అంతర్గత రోడ్లు డ్రైనేజీలకు నిధులు వెచ్చించి ఎక్కడికక్కడ పనులను వేగవంతం చేయడం జరుగుతుందని అన్నారు. ఇంకా చాలా ప్రాంతాలలో చేయాల్సి ఉందని సాధ్యమైనంత వరకు పనులను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తున్నామని పేర్కొన్నారు.






