పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాధరి కిశోర్
నూతనకల్, మార్చి 24: మండల పరిధిలోని పలు కుటుంబాలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మంగళవారం పరామర్శించారు. పెదనేమిల గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సభ్యురాలు చురకంటి జానకమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె నివాసానికి వెళ్లిన కిషోర్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బి.ఆర్.ఎస్.వి నాయకుడు కనకం గణేష్ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, సర్పంచులు చురకంటి లావణ్య మధుసూదన్ రెడ్డి, మహేశ్వరం మల్లికార్జున్, జటంగి సరితా కృష్ణ, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, నాయకులు బత్తుల విద్యాసాగర్, బత్తుల విజయ్, రేసు వెంకటేశ్వర్లు, మొగుళ్ళ వెంకన్న, ఉప్పుల వీరు యాదవ్, కనకటి మహేష్, వీరమల్ల యాదగిరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.




