ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలి
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్..
చిట్యాల (విజయక్రాంతి): ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆదివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అవగాహన కల్పించారు. గుండ్రాంపల్లి, సుంకేనపల్లి గ్రామం అత్యంత సమస్యాత్మకంగా గుర్తించామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసులకు సహకరించాలని అన్నారు. గుండ్రంపల్లి యూ - టర్న్ వద్ద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ ను పరిశీలన చేసి తరుచూ ప్రమాదాలు జరుగుతునందున కమిటీని ఏర్పాటు చేసుకోవాలి గ్రామస్తులను సూచించారు. ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి సిఐ కే.నాగరాజు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




