26 April, 2026 | 6:55 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

అక్రమ దగ్గు సిరప్ కేసులో ఈడీ దాడులు

12-12-2025 11:35 AM

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ దగ్గు సిరప్(Cough Syrup) వ్యాపార రాకెట్‌పై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) శుక్రవారం వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలపై దాడులు నిర్వహించిందని అధికారులు తెలిపారు. రాంచీ, అహ్మదాబాద్‌లలో ఉన్న వాటితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, వారణాసి, జౌన్‌పూర్, సహరాన్‌పూర్‌లలో 25 స్థలాలపై ఈ సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. అక్రమ వ్యాపారాన్ని విచారించడానికి ఫెడరల్ దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ నిరోధక చట్టం (Prevention of Money Laundering Act) కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. 

పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్, అతని సహచరులు అలోక్ సింగ్, అమిత్ సింగ్, మరికొందరు, దగ్గు సిరప్ తయారీదారులు, చార్టర్డ్ అకౌంటెంట్ (CA) విష్ణు అగర్వాల్‌కు సంబంధించిన ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. కోడైన్ ఆధారిత దగ్గు సిరప్‌ల (Choice Based Credit System) దుర్వినియోగం, వాటి అక్రమ తయారీ, వ్యాపారం, బంగ్లాదేశ్ సరిహద్దు అంతటా రవాణాకు సంబంధించిన సంఘటనలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత నమోదు చేసిన దాదాపు 30 UP పోలీసుల ఎప్ఐఆర్ ల ఆధారంగా ఈడీ చర్య తీసుకుంది. ఈ కేసులో నేరాల మొత్తం ఆదాయం దాదాపు రూ.1,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ దుబాయ్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది. అతని తండ్రిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర పోలీసులు ఇప్పటివరకు మొత్తం 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక సిట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.